చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం, corona patients selfie video
![చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం, corona patients selfie video](https://tv8facts.in/wp-content/uploads/2020/06/PicsArt_06-30-01.38.26-780x470.jpg)
ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం 24 గంటలు గడవక ముందే మరో వ్యక్తి మృతి. corona patients selfie video బయట పడింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది . సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిసూ మరో వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు . వివరాల్లోకి వెళితే .. డాక్టర్లు పట్టించు కోవడం లేదంటూ మృత్యువుతో 3 గంటల పాటు పోరాడిన రవికుమార్ .. చివరకు అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ప్రాణాలు కోల్పోవడానికి ముందు రవికుమార్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గామారింది .
corona patients selfie video ::
ఈ ఘటనజరిగి 48 గంటలు గడవక ముందే మరో వ్యక్తి కూడా అదేరీతిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది . తనకు వైద్యం చేయడం లేదని సెల్ఫీవీడియో తీసుకుని సయ్యద్ నే వ్యక్తి చనిపోయాడు . తీవ్ర అనారోగ్యం ఉన్న తనను పట్టించు కోవడం లేదని సయ్యద్ ఆ వీడియోలో పేర్కొన్నారు . మరో వైపు సయ్యద్ సోమవారం ఉదయం మరణించినప్పటికీ .. ఇప్పటి వరకు వరకు అతని మృతదేహాన్ని ఆస్పత్రి వర్గాలు కుటుంబసభ్యులకు అప్పగించలేదు . దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు . కాగా , చెస్ట్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి .
తెలంగాణలో 15 వేలు దాటిన కరోనాకేసులు 24 గంటల్లోనే 975 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు రోజురో జుకు పెరుగుతున్నాయి . గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 15 , 394 కి చేరింది . ఈమేరకు సోమ వారం రాత్రి తెలంగాణ వైద్య , ఆరోగ్య శాఖ కరోనా పై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది . రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 5,582 మంది డిశ్చార్జికాగా , ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి . కరోనాతో మరో 6 గురు మృతి చెందడంతో .. మొత్తం మృతుల సంఖ్య 253 కి చేరింది . తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 861 ఉన్నాయి .