Trending

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, Telangana COVID19 cases

 రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి . Telangana COVID19 cases శనివారం కేవలం 74 కేసులు నమోదు కాగా , ఆరుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది .

 కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 41 మంది ఉండగా , రంగారెడ్డిలో 5 , సంగారెడ్డి 3 , మహబూబ్ నగర్ లో 2 , జగిత్యాల 2 , సూర్య పేట్ , వనపర్తి , వరంగల్ అర్బన్ , వికారాబాద్ , మేడ్చల్ , నాగర్ కర్నూల్ , నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోక్క కేసులు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు . దీంతో పాటు 9 మంది వలస కార్మికులకు , ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గాల ద్వారా వచ్చిన ఐదు మందికి వైరస్ నిర్ధారణ అయింది . దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2499 కి చేరగా , వీటిలో రాష్ట్రా నికి చెందిన కేసులు 2068 ఉన్నాయి . అదే విధంగా వలస కార్మికులు , ఫారెన్ నుంచి వచ్చిన వాళ్లు , వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు మొత్తం 431 మందికి వైరస్ తేలింది . ఇప్పటి వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1412 మంది ఇళ్లకు చేరగా , ప్రస్తుతం ప్రభుత్వ నోటి ఫైడ్ ఆసుపత్రుల్లో 10 10 మంది చికిత్స పొందు తున్నట్లు అధికారులు తెలిపారు .

Telangana COVID19 cases ::

 వైరస్ దాడిలో మొత్తం 77 మంది చనిపోయారని వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించింది . వికారాబాద్ జిల్లా తాండూరులో వైరస్ కలకలం రేపింది . కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇక్కడికి వచ్చిన తర్వాత వైరస్ ఉందని తేలిందని అధికారులు స్పష్టం చేశారు . దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కూతురికి వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు . అయితే గ్రేటర్ పరిధిలో కేసులు భారీగా నమోదవుతుండటంతో అధికా రులు సైతం ఆందోళన చెందుతున్నారు . ముఖ్యంగా పాతబస్తీ జియాగూడ , కార్వన్ తో పాటు మరో 15 ప్రాంతాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉందని వైద్యశాఖ చెబుతుంది .

 24 రోజుల పసికందు , 3 నెలల బాబు మృతి వైరస్ దాడిలో మరో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు . 24 రోజుల పసికందు , 3 నెలల బాబు ఉండటం ఆందోళనకరం . వీరిలో 3 నెలల బాలుడికి గుండె సమస్యలు ఉన్నా యని , అదే విధంగా 24 రోజుల పసికందు వైరస్ దాడిని తట్టుకోలేక మరణించినట్లు అధికా రులు తెలిపారు . అదే విధంగా హైపర్‌టెన్షన్ , డయాబెటిస్ కలిగిన 58 , 62 , 52 ఏళ్ల వయస్సు కలిగిన ముగ్గురు వ్యక్తులు కరోనా సోకి మృతి చెందారు . దీంతో పాటు హార్ట్ సర్జరీ చేపించుకున్న 47 ఏళ్ల వ్యక్తి కూడా కోవిడ్ సోకి మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు . మరో వైపు కొత్తగా వనపర్తి జిల్లాలో కేసు నమోదు కావడంతో జీరో కేసుల జాబిత నుంచి ఈ జిల్లాను అధికారులు తొలగించారు .

Related Articles

Back to top button