తెలంగాణ లో మళ్లీ పెరిగిన కరోనా, Telangana coronavirus cases

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా ఉధృతి కొనసాగుతోంది. Telangana coronavirus cases సోమవారం ఒక్క రోజే 66 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ ఆగడం లేదు. జీహెచ్ఎంసీని ఎక్కువగా  వణికిస్తున్న కరోనా వైరస్.

సోమవారం నాడు 15 మంది వలస కార్మికులకు పాజిటివ్ వచ్చింది. మరియు 18 మంది విదేశీ ప్రయాణికులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.  మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు.

Telangana coronavirus cases ::

రాష్ట్రంలో  మహమ్మారి విజృంభిస్తూనే ఉంది . సోమవారం మరో 66 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ మహమ్మారితో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు . జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా సోకిందని వైద్య , ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది . ఇతర రాష్ట్రా లనుంచి వచ్చిన వలసకూలీల్లో 15 మందికి వ్యాధి సోకగా , విదేశాల నుంచి వచ్చిన 18 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొంది .

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 1920 కి చేరాయి . ఆసుపత్రిలో చికిత్సనుంచి కోలుకుని 72 మంది డిశ్చార్జి కావడంతో ఈ సంఖ్య 1164 గా నమోదైంది . మరో 700 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . కరోనాతో మరణించిన వారి సంఖ్య 56 కు చేరింది . రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ నమోదైంది .

Related Articles

Back to top button