Trending

తెలంగాణలో పెరిగిన కరోనా వైరస్, COVID19 tally in Telangana state

రాష్ట్రంలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరియు మరో ముగ్గురు మృతి చెందారు COVID19 tally in Telangana state 1761 రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి . శుక్రవారంనాడు కొత్తగా 62 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . ఇందులో జిహెచ్ఎంసి వరిధిలో 42 మంది ఉన్నారు . రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరు మరో 19 మంది వలస కూలీలకు కరోనా పాజిటీవ్ నమోదైంది . కాగా , కరోనా కారణంగా ఇదే రోజు మరో ముగ్గురు మృతి చెందారు . మరో ఏడు గురు డిశ్చార్జ్ అయ్యారు .

 రాష్ట్రంలో ఇప్పటి వరకు 1761 పాజిటీవ్ COVID19 tally in Telangana state కేసులు నమోదయ్యాయి . అందులో ఇప్పటి వరకు 1043 మంది కోలుకున్నారు . కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 48 కి చేరింది . ఇప్పటి వరకు వలస జీవుల్లో పాజిటీవ్ వచ్చిన వారి సంఖ్య 118 కు చేరింది . ఇంకా 670 మంది వివిధ ఆనుపత్రులలో చికిత్స పొందుతున్నారు . కాగా , వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదు.గత 14 రోజులుగా 25 జిల్లాల్లో కరీంనగర్ , సిరిసిల్ల , కామా రెడ్డి , మహబూబ్ నగర్ , మెదక్ , భూపాలపల్లి , నాగర్ కర్నూల్ , ములుగు , పెద్దపల్లి , సిది పేట , మహబూబాబాద్ , మంచిర్యాల , భద్రాద్రి కొత్తగూడెం , వికారాబాద్ , నల్లగొండ , ఆసిఫాబాద్ , ఖమ్మం , నిజామాబాద్ , ఆదిలాబాద్ , సూర్యపేట , నారాయణపేట , వరంగల్ అర్బన్ , జనగామ్ , గద్వాల్ , నిర్మల్ ) ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు .

 ఇదిలా ఉండగా , కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులకు వైరస్ సోకుతున్నందునే కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి . హైదరాబాద్ లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది . పలు చోట్ల వలస కూలీలకు కూడా కరోనా పాజిటీవ్ వస్తుంది .

Related Articles

Back to top button