తెలంగాణలో పెరిగిన కరోనా వైరస్, COVID19 tally in Telangana state
![తెలంగాణలో పెరిగిన కరోనా వైరస్, COVID19 tally in Telangana state](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200523_015425.jpg)
రాష్ట్రంలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరియు మరో ముగ్గురు మృతి చెందారు COVID19 tally in Telangana state 1761 రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి . శుక్రవారంనాడు కొత్తగా 62 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . ఇందులో జిహెచ్ఎంసి వరిధిలో 42 మంది ఉన్నారు . రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరు మరో 19 మంది వలస కూలీలకు కరోనా పాజిటీవ్ నమోదైంది . కాగా , కరోనా కారణంగా ఇదే రోజు మరో ముగ్గురు మృతి చెందారు . మరో ఏడు గురు డిశ్చార్జ్ అయ్యారు .
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1761 పాజిటీవ్ COVID19 tally in Telangana state కేసులు నమోదయ్యాయి . అందులో ఇప్పటి వరకు 1043 మంది కోలుకున్నారు . కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 48 కి చేరింది . ఇప్పటి వరకు వలస జీవుల్లో పాజిటీవ్ వచ్చిన వారి సంఖ్య 118 కు చేరింది . ఇంకా 670 మంది వివిధ ఆనుపత్రులలో చికిత్స పొందుతున్నారు . కాగా , వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదు.గత 14 రోజులుగా 25 జిల్లాల్లో కరీంనగర్ , సిరిసిల్ల , కామా రెడ్డి , మహబూబ్ నగర్ , మెదక్ , భూపాలపల్లి , నాగర్ కర్నూల్ , ములుగు , పెద్దపల్లి , సిది పేట , మహబూబాబాద్ , మంచిర్యాల , భద్రాద్రి కొత్తగూడెం , వికారాబాద్ , నల్లగొండ , ఆసిఫాబాద్ , ఖమ్మం , నిజామాబాద్ , ఆదిలాబాద్ , సూర్యపేట , నారాయణపేట , వరంగల్ అర్బన్ , జనగామ్ , గద్వాల్ , నిర్మల్ ) ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు .
ఇదిలా ఉండగా , కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులకు వైరస్ సోకుతున్నందునే కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి . హైదరాబాద్ లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది . పలు చోట్ల వలస కూలీలకు కూడా కరోనా పాజిటీవ్ వస్తుంది .