Trending

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది, Coronavirus cases Telangana

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. Coronavirus cases Telangana 2098 బుదవారం ఒక్క రోజే 107 కేసులు నమోదయ్యాయి. మే నెలలో ఒక్క  రోజు 107 పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి . అదేవిధంగా .. ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 100 కు పైగా ఉండడం కూడా ఇదే మొదటిసారి .

 బుధవారం నమోదైన 107 పాజిటివ్ కేసులుకలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2098 కు చేరుకుంది . ఈ మేరకు రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది . ఇతర దేశాలకు , ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లి తిరిగి వస్తున్నవారి కారణంగానే తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది . వైద్య , ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి .

Coronavirus cases Telangana ::

 మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ లోని జిల్లాలు , జీహెచ్ఎంసీతో కలుపుకుని 39 పాజిటివ్  కేసులు మాత్రమే నమోదయ్యాయి . బుధవారం ఒక్కరోజే ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లి తిరిగి వచ్చినవారిలో 19 మందికి , సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 49 మందికి మొత్తం 68 మందికి కరోనా మహమ్మారి సోకింది . ఇప్పటివరకు ఇతర రాష్ట్రా లనుంచి స్వస్థలాలకు వచ్చిన 178 మంది వలస కూలీలకు , సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 94 మందికి , ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 30 మందికి మొత్తం 297 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది .

 రాష్ట్రంలో కోవిడ్ -19 మృత్యుఘోషక కొనసాగుతోంది . తాజాగా బుధవారం ఆరుగురు కరోనా బారిన పడి మృతిచెందారు . మంగళవారం వరకు 57 గా ఉన్న కరోనా మృతుల సంఖ్య బుధవారానికి 63 కు చేరుకుంది . కరోనా బారిన పడి రాష్ట్రంలో ఒకే రోజు ఆరుగురు మృతిచెందడం కూడా ఇదే తొలిసారి . ఇప్పటి వరకు 1821 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారంనాటి ప్రకటనలో తెలిపింది . ఇంకా 714 మంది  బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది .

Related Articles

Back to top button