తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, Telangana COVID19 cases tally
![తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, Telangana COVID19 cases tally](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200529_013747.jpg)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. Telangana COVID19 cases tally కొత్తగా 117 పాజిటీవ్ కేసులతో పాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరగడం ఆగడం లేదు . గురువారంనాడు కొత్తగా 117 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి .
ఇందులో తెలంగాణ నుంచి 66 ( జిహెచ్ఎంసిలో 58 , రంగారెడ్డిలో 5 , మేడ్చల్ 2 , సిద్దిపేటలో 1 ) మంది , ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇద్దరు , సౌదీ అరేబియా నుంచి 49 మంది ఉన్నారు . ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది . కరోనా కారణంగా గురువారం రోజు నలుగురు మృతి చెందారు . కాగా , రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,256 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి . ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1345 కి చేరింది . కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 67 కి చేరింది . ఇంకా 844 మంది వివిధ ఆసువత్రులలో చికిత్స పొందుతున్నారు .
Telangana COVID19 cases tally ::
ఇప్పటి వరకు నమోదైన 2,256 పాజిటీవ్ కేసుల్లో తెలంగాణ స్థానికులు 1908 ఉండగా , వలస కూలీలు 175 మంది , సౌదీ అరేబియా నుంచి 143 మంది , విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది వరకు ఉన్నారు . కాగా , వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు నమోదు కాలేదు.గత 14 రోజులుగా 20 జిల్లాల్లో కరీంనగర్ , సిరిసిల్ల , కామారెడ్డి , మహ బూబ్ నగర్ , మెదక్ , భూపాలపల్లి , నాగర్ కర్నూల్ , ములుగు , పెద్దపల్లి , సిద్దిపేట , మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం , అసిఫాబాద్ , ఖమ్మం , నిజామాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ అర్బన్ , గద్వాల్ , జనగామ్ , నిర్మల్ ) ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు . పాజిటీవ్ కేసుల సంఖ్య హైదరాబాద్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి .