తెలంగాణలో ఆగనీ కరోనా, Coronavirus cases in Telangana state
![తెలంగాణలో ఆగనీ కరోనా, Coronavirus cases in Telangana state](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200518_083411.jpg)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి ప్రజలను దడ పుట్టిస్తోంది. Coronavirus cases in Telangana state 1551, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరసను నియంత్రిం చలేకపోతున్నామన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది . ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 42 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 37 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం బట్టి చూస్తుంటే వైరస్ తీవ్రత ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోందని అధికారులు అంటున్నారు .
Coronavirus cases in Telangana state ::
తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇరువురు ఈ మహమ్మా రిబారిన పడ్డారు . ముగ్గురు వలస కూలీలకు వైరస్ సోకడంతో వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు . ఆదివారం నాటి 42 కేసులు కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసుల సంఖ్య 1551 కు చేరింది . 992 మంది డిశ్చార్జి కాగా 525 మంది ఇంకా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు . ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసకూలీల్లో ఇప్పటిదాకా 57 మందికి మహమ్మారిసోకింది .
ఆదివారం 21 మంది వ్యాధి గ్రస్థులను డిశ్చార్జి చేయగా ఇప్పటిదాకా ఈ మహమ్మారితో 34 మంది మృత్యు వాత పడ్డారు . వరంగల్ రూరల్ , యాదాద్రి , వనపర్తి జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కేసుకూడా నమోదు కాలేదు . రాష్ట్రంలోని 25 జిల్లాల్లో గత రెండువారాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదని వైద్య రోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది . కాగా మాదన్నపేట ప్రాంతంలో ఒక బర్త్ డే పార్టీకి వెళ్లి 28 మందికి వైరస్ సోకిన విషయం తెలిసిందే . మరో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 31 కి చేరింది . కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అంత కంతకూ విజృంభిస్తోంది . తాజాగా నమోదైన 42 పాజిటివ్ కేసులతో అధికార యంత్రంగా మరింత అప్రమత్తం కావాలని నిర్ణయించింది .