సైంటిస్ట్ నే కాటేసిన కరోనా వైరస్, Indian scientist died with Coronavirus

దక్షిణాఫ్రికాలో శాస్త్రవేత్త కన్నుమూత పూజ కరోనా లక్షణాల తో మృతి చెందారు . Indian scientist died with Coronavirus ప్రపంచ ప్రఖ్యాత వైరాలజి శాస్త్రవేత్త, భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో కన్నుమూశారు .

 భారత దేశానికి చెందిన వాక్సిన్ శాస్త్రవేత్త , హెచ్ఐవీ పరిశోధకురాలు ప్రొఫెసర్ గీతా రామ్ జి ( 50 ) దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు . Indian scientist died with Coronavirus కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు .

 వారం క్రితమే గీతా రామ్ జీ లండన్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్నారు . అనంతరం అనారోగ్యానికి గురయ్యారు . ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు . కొవిడ్ – 19 సంబంధిత లక్షణాలకు చికిత్స పొందుతూ గీతా రామ్ జి మరణించారని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి ( ఎస్ఏఎంఆర్సీ ) ప్రకటనలో పేర్కొంది .

 గీతా రామ్ జి అకస్మిక మరణం ఎంతగానో కలచివేసిందని ఎస్ఎంఆర్సీ అధ్యక్షుడు గ్రైండా గ్రే పేర్కొన్నారు . గీతా రామ్ జి దక్షిణాఫ్రికా వైద్యపరిశోధన మండలి ( ఎస్ఏఎంఆర్సీ ) లోని క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ముఖ్య పరిశోధకురాలిగా సేవలు అందిస్తున్నారు . హెచ్ఐవీ నిర్మూలనపై పరిశోధనలు చేస్తున్నారు .

 ఈ పరిశోధనలకుగాను ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డులను సొంత చేసుకున్నారు. యూరోపియన్ క్లినికల్ ట్రయల్స్ భాగస్వామ్యాభివృద్ధి సంస్థ ( ఈడీసీటీపీ ) 2018లో గీతాను అసాధారణ మహిళా శాస్త్రవేత్త అవార్డుతో సత్కరించింది.

 హెచ్ఐవీ నిర్మూలనలో సరికొత్త పద్దతులను కనిపెట్టినందుకు ఈ సత్కారం లభించింది . హెచ్ఐవీ కారణంగా దక్షిణాఫ్రికా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గీతా రామ్ జి కృషి చేశారు . దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్ ప్రవీణ్ రామ్లని వివాహం చేసుకున్నారు .

 ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కొవిడ్ – 19 కారణంగా ఐదుగురు మరణించారు . భారత సంతతికి చెందిన తొలికేసు ఇదే . ఇప్పటివరకు ఆ దేశంలో 1350 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

Related Articles

Back to top button