లాక్ డౌన్ పొడిగింపు? Government to extend lock down ?

 దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగించనున్నారా ! ? ఏప్రిల్ 14వ తేదీ తర్వాత Government to extend lock down మరో వారం రోజులపాటు ఇది కొనసాగే అవకాశం ఉందా ! ? ఈ ప్రశ్నలకు ‘ ఔను ‘ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు .

 లాక్ డౌన్ పొడిగింపు దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని చెబుతున్నాయి . ఎవరూ ఊహించని విధంగా తెరపైకి వచ్చిన తబ్లిగి జమాత్ ఘటనే ఇందుకు కారణమని వివరిస్తున్నాయి . దేశవ్యాప్తంగా విస్తరి స్తున్న కరోనాను అరికట్టడమే ధ్యేయంగా మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించిన ప్రధాని మోదీ  ఆ తర్వాత 24వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని కూడా ప్రకటించారు . దీనికి తోడు జాతీయ , అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేశారు . ఫలితంగా లాక్ డౌన్ కారణంగా సానుకూల ఫలితాలు వచ్చాయి . విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా కరోనా సోకే కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి . దాంతో , లాక్ డౌనను పటిష్టంగా అమలు చేస్తే , ఏప్రిల్ తొమ్మిదో తేదీ నాటికి కొత్త కేసులు తగ్గిపోతాయని , రెండో దశ ప్రారంభంలోనే కరోనాను నిలువరించినట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అందరూ వాళ్ళే::

అనూహ్యంగా ఢిల్లీలో మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చింది . అప్పటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది . ఏదో ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మర్కజ్ లింకులు బయట పడుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , తెలంగాణ , కర్ణాటక , మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో నమోదవు తున్న కొత్త కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు , వారి సన్నిహితులకే సోకుతున్నాయి . మరీ ముఖ్యంగా , గత మూడు నాలుగు రోజులుగా మర్కజ్ సంబంధం ఉన్న కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

 తాబ్లిగి జమాత్ సమావేశానికి హాజరైనవారు , వారిని కలిసిన వారు కలిపి 22 వేల మందికి పైగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది . దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వీరు ఉన్నారని అంచనా వేసింది . వారిలో ఇప్పటి వరకూ 1023 మందికి కరోనా పాజిటివ్ రాగా మిగిలిన వారంతా క్వారంటై , ఐసొలేషన్లో ఉన్నారు.

 దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో తబ్లిగి జమాత కు సంబంధించిన వారే 30 శాతం ఉన్నారని ప్రకటించింది . ఈ నేపథ్యంలో , రాబోయే కొద్ది రోజుల్లోనే మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

 మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి . వారందరినీ గుర్తించి , క్వారంటైన్లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది . దాంతో , వారి నుంచి ఎంత మందికి వైరస్ సోకిందనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు . ఈ లెక్క లన్నీ పక్కాగా తేలే వరకూ లాక్ డౌనన్ను ఎత్తి వేసే అవకాశాలు కనిపించడం లేదు.

 ఇందుకు కారణాలనూ అధికారులు వివరిస్తున్నారు . గత మూడు నాలుగు రోజులుగా ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 400కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడుల్లో నమోదవు తున్న కొత్త కేసులన్నీ తల్లీగీ జమాత కు చెందినవే . ఇతర రాష్ట్రాల్లో నమోదవు తున్న కొత్త కేసుల్లోనూ వీటికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి . ఇక , మరణాల్లోనూ ఇదే పరిస్థితి.

 తెలంగాణలో ఇప్పటి వరకూ 11 మంది మరణిస్తే . అంతా మర్కజ్ తో లింకు ఉన్నవారే . ఈ నేపథ్యంలోనే , రాబోయే కొద్ది రోజులపాటు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి పాజు టివ్ కేసులు పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్రం అంచనా వేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి . అందుకే , కరోనాను పూర్తిగా నిలువరించాలంటే లాక్ డౌనను Government to extend lock down ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోందని వివరిం చాయి .

Related Articles

Back to top button