Trending

రాష్ట్రంలో భారీగా నమోదైన కరోనా కేసులు, COVID19 cases increasing in TS

 రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది COVID19 cases increasing in TS రోజువారీగా నమోదువుతున్న కేసుల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు . గత వారం రోజులుగా ప్రతిరోజూ 200 లకుపైగా నమోదవుతున్న మాదిరిగానే మంగళవారం కూడా మరో 213 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

 జీహెచ్ఎంసీ పరిధిలోనివే 165 కేసులు ఉన్నాయి . నమోదైన పాజిటివ్ కేసులు , మృతి చెందిన వారు , డిశ్చార్జ్ అయిన వారి వివరాలతో మంగళ వారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక హెల్త్ బులెటినను విడుదల చేసింది . తాజాగా కేసులు కలుపుకుంటే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,406 కు చేరింది .

COVID19 cases increasing in TS ::

 మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు . దీంతో మృతుల సంఖ్య 1918 చేరింది . కరోనా చికిత్స పొంది 261 మంది కోలుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు . ఇప్పటివరకు 3,027 మంది పూర్తిస్థాయిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు . మంగళ వారం నాటికి 2,188 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు . మంగళవారం 1251 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 213 మందికి పాజిటివ్ గా తేలింది . 1,038 మందికి నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి . ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల వివరాలను చూస్తే 44,431 మందికి క రోనా నిర్ధారణ పరీక్షలు 5,406 మందికి కరోనా సోకింది . 39,025 మందికి కరోనా సోకలేదని రిపోర్టులో తేలింది . 

Related Articles

Back to top button