కూలీల కు 40 ప్రత్యేక రైళ్లు, Special trains for migrant workers
![కూలీల కు 40 ప్రత్యేక రైళ్లు, Special trains for migrant workers](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200505_081339.jpg)
దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు Special trains for migrant workers ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు తెలిపారు . మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు .
Special trains for migrant workers …
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్ , ఖమ్మం , రామగుండం , దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు . బీహార్ , ఒడిస్సా , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని తెలిపారు . లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ప్రగతి భవన్లో ఉన్న స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు . హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై సుదీర్ఘంగా చర్చించారు .
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి migrant workers తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు . ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో మాట్లాడి , మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు . అందుకు ఆయన అంగీకారం తెలిపారు . పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు వలస కార్మికలు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కార్మికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు , రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని ఆటంటకం లేకుండా చూసేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా , సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది .
తమ సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు . అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు . పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు . తెలంగాణ ప్రభుత్వం కార్మికులను తమసొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినందున ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు . ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి , కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ముఖ్యమంత్రి కోరారు . ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , సిఎస్ సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .