తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు ఇవే, KCR press meet details

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్…..KCR press meet details లాక్ డౌన్ 29 వరకు పొడిగింపు… రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపులు ఓపెన్….
KCR press meet details ::
- రాష్ట్రంలో లాక్ డౌన్ మే 29 వరకు పొడగింపు.
- లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలి.
- రాష్ట్రంలో 1096 కు చేరిన కరోనా భాదితులు…
- ఇవాళ కొత్తగా 11 మందికి పాజిటివ్.. 43 మంది డిశ్చార్జ్.
- రాష్ట్రంలో 439 యాక్టిివ్ కేసులు నమోదు.
- రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్..
- 12 గంటలు మద్యం షాపులు ఓపెన్ ఉంటాయి.
- చీఫ్ లిక్కర్ పై 11 శాతం పెంపు.
- రెడ్ జోన్ లోను మద్యం షాపులు ఓపెన్.
- మిగతా అన్ని బ్రాండ్ల పై 16 శాతం పెంపు.
- హాట్ స్పాట్ లలో మాత్రమే లిక్కర్ షాప్ లు బందు.
- మాస్క్ లేకపోతే లిక్కర్ ఇవ్వబడదు.
- వైన్ షాపుల వద్ద గుంపులు గుంపులుగా జనం ఎగబడ వద్దు.
- ప్రజలు సహకరించకపోతే మద్యం షాపులను వెంటనే క్లోజ్ చేస్తాం.
- సోషల్ డిస్టెన్స్ లేకపోతే వైన్ షాపులను క్లోజ్ చేస్తాం.
- అవసరం మేరకే కరోనా టెస్టులు చేస్తాము.
- కరీంనగర్ నుంచి దేశానికే రోల్ మోడల్ అయినం.
- సింగిల్ డెత్ లేకుండా కరీంనగర్ ను కాపాడుకున్నం.
- ఆగస్టు, సెప్టెంబర్ లో రాష్ట్రం నుంచే వచ్చే అవకాశం ఉంది.
- రాష్ట్రంలో కరోనా ను పకడ్బందీగా కట్టుబడి చేశాం.
- రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి…
- 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి… 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
- కొత్త కేసులని జీహెచ్ఎంసీ పరిధిలోని వస్తున్నాయి.
- కేంద్ర సడలింపులు పాటించాల్సిందే.
- రెడ్ జోన్లలో 66% పాజిటివ్ కేసులు ఉన్నాయి.
- రాత్రిపూట కఠినమైన కర్ఫ్యూ కొనసాగుతుంది.
- రాష్ట్రంలో సరిపడా మాస్కులు, పిపిఈ కిట్లు తక్కువగా ఉన్నాయి.
- కొద్ది రోజులు ఓపిక పడితే మంచి ఫలితాలు.
- ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కైనా సిద్ధంగా ఉన్నాము.
- రెడ్ జోన్ లలో ఎట్టి పరిస్థితుల్లో షాపులు తెరవడానికి వీలులేదు.
- 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చాము.
- 27 జిల్లాల్లో అన్ని సడలింపుpలు.
- వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయి.
- నిర్మాణ వ్యవసాయ సంబంధిత షాపులు తీయడానికి తీయడానికి ఓకే.
- 6 రెడ్ జోన్ జిల్లాలలో ఎటువంటి సడలింపులు ఉండవు.
- 15వ తేదీన సమీక్ష నిర్వహించి సడలింపు లపై చర్చిస్తాం.
- గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో అన్ని షాపులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచబడతాయి.
- సోషల్ డిస్టెన్స్ లేకపోతే అన్ని క్లోస్ చేస్తాం.
- అన్ని ఆర్టిఏ ఆఫీసులో రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి.
- తెలంగాణ కన్నా చిన్న దేశాలు వందకు పైగా ఉన్నాయి.
- కోర్టు నిబంధనల ప్రకారం పదవతరగతి పరీక్షలు.
- తక్కువ మంది విద్యార్థులతో పరీక్ష కేంద్రాలు.
- మే నెలలో టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తాం.
- భూముల, అమ్మకాలు కొనుగోళ్లు జరుపుకోవచ్చు.
- రేపటి నుంచి ఇంటర్ పేపర్ వాల్యూవేషన్ కొనసాగుతుంది.
- కరోనా, మనం కలిసి బతకాల్సిందే.
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మండల కేంద్రాలు, గ్రామాల్లో సడలింపులు
- రాత్రిపూట కర్ఫ్యూ రాష్ట్రం మొత్తం ఉంటుంది.
- యువ న్యాయవాదులకు సాయం చేసేందుకు రూ.25 కోట్లు.
- తక్షణమే లాయర్లకు కు రూ.15 కోట్లు రిలీజ్.
- ఏడున్నర లక్షల మంది కార్మికులకు వసతులు కల్పించాo.
- వలస కూలీలు ఉంటే వారికి అన్ని వసతులను సమకూర్చుతాం.
- వలస కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్తామంటే పంపిస్తాం.
- ఏ రాష్ట్రంలో పంటలు కొనడం లేదు.
- తెలంగాణలో మాత్రమే పంటలు కొంటున్నాం.
- 7 వేలకుపైగా సెంటర్లలో ధాన్యం కొంటున్నం.
- ఈ విషయాన్ని విపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయి.
- తెలంగాణ లో ఉండేది రైతు రాజ్యం చిల్లర రాజకీయం కాదు.
- రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమే.
- వర్షాకాలంలో రైతుబంధు పథకం కింద రైతులకు 7 వేల ఇస్తాం.
- పేదలకు పెన్షన్లు కొనసాగుతాయి.
- కెసిఆర్ ఉన్నంతవరకు రైతుబందు కొనసాగుతుంది.
- రుణమాఫీ కోసం రేపే 12 కోట్లు రిలీజ్ చేస్తాం.
- రూ 25 వేల లోపు ఉన్నవారికి మాఫీ చేస్తాం.