దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్మీ, Encounter in Kashmir
![దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్మీ, Encounter in Kashmir](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200507_005628.jpg)
Encounter in Kashmir ఎన్కౌంటర్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్తో సహా నలుగురు ఉగ్రవాదులు కాల్చివేత స్వగ్రామంలోనే హతమైన రియాజ్ నైకో శ్రీనగర్.
నిషేధిత హిజ్బుల్ ముజాహిదీస్ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకోతో సహా నలుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యారు . బుధవారంనాడు జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆ నలుగురు ఉగ్రమాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు .
పుల్వామా జిల్లా బేగ్ పొర గ్రామంలో జేఎం కమాండర్ రియాజ్ నైకో , మరో మిలిటెంట్ హతమయ్యాడు . 8 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకోపై రూ . 12 లక్షల రివార్డు కూడా ఉంది . ” స్వగ్రామంలోనే భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు . మరొకరిని ఇంకా గుర్తించాల్సి ఉంది .
షర్దాలి గ్రామంలో జరిగిన మరొక ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు . దీంతో జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం కాశ్మీర్ లోయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపేశారు . 2016 జులైలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బుర్హన్ వనీ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తర్వాత రియాజ్ నైకో డీ – ఫాక్టో చీగా కొనసాగుతున్నారు . దక్షిణ కాశ్మీర్ షోపియాన్లో మూడుసార్లు భద్రతా బలగాల ఉచ్చు నుంచి తప్పించుకున్నాడు . స్వగ్రామం బేగ్ పొరకు వస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు , భద్రతా బలగాలు Encounter in Kashmir సంయుక్తంగా నిఘా వేసి , మట్టుబెట్టినట్లు సైనిక అధికార ప్రతినిధి తెలిపారు .
ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .