హోమ్ మినిస్టర్ వార్నింగ్… Home minister warning

న్యూఢిల్లీ : ఇండియాకు సంబంధించినంత వరకూ అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను Home minister warning కొనసాగించాలనే కోరుకుంటున్నామని , ఇదే సమయంలో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా , రెచ్చగొట్టినా , బుద్ధి చెప్పే తీరుతామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు . ఓ జాతీయ చానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన , ఇండియాను రెచ్చగొట్టే వారిని విడిచి పెట్టబోమని , ఏ మాత్రం ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు . ఇండియా వ్యవహారశైలి ఎప్పుడూ సున్నితంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్ సింగ్ , అంతమాత్రాన శత్రువులు రెచ్చిపోయేందుకు అవకాశం ఇచ్చినట్లు కాదని అన్నారు . రెచ్చిపోతే చేతులు ముడుచుకుని కూర్చుంటామని మాత్రం భావించవద్దని , చైనా పేరెత్తకుండా పరోక్ష హెచ్చరికలు చేశారు .

భారత సరిహద్దుల్లో కాపలాగా ఉండే జవాన్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడంలో వేగవంతంగా స్పందిస్తున్నామని , ఇది ఏ దేశాన్నీ భయపెట్టేందుకు కాదని , అక్కడి ప్రజల సంక్షేమం కోసమే ఈ పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు . కాగా , చైనా సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసే విషయంలో భారత్ దూకుడుగా వుంది . చైనా సైతం తమ వైపు భారీ ఎత్తున రహదారులు , సైనిక స్థావరాలు , ఎయిర్ బేర్లను అభివృద్ధి చేస్తోంది . ఇదే సమయంలో పాకిస్థాన్ వీలు చిక్కినప్పుడల్లా ఇండియాలోకి ఉగ్రవాదులను చొప్పిస్తోందని Home minister warning మండిపడిన రాజ్ నాథ్ , భారత జవాన్లు వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని , రహస్యంగా శత్రువుల భూభాగాల్లోకి వెళ్లి దాడి చేసే సత్తా మన జవాన్లకూ ఉందని నిరూపితమైందని గుర్తు చేశారు . భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ ప్రధానుల జోక్యాన్ని కూడా సహించబోమని , వారి జోక్యం కూడా తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు .

రైతుల ఆందోళనలను ప్రస్తావించిన ఆయన , నిరసన తెలుపుతున్న రైతుల్లో నక్సలైట్లు , ఉగ్రవాదులు ఉన్నారని తాము ఎన్నడూ చెప్పలేదని అన్నారు . ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని , అంశాల వారీగా చర్చి స్తే , ఓ పరిష్కారం లభిస్తుందనే తాను నమ్ముతున్నానని తెలిపారు . అన్నం పెట్టే అన్నదాతలను తాను గౌరవిస్తానని , వారికి కనీస మద్దతు ధర కొనసా గుతుందని , వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశమని అన్నారు . జమ్ము కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటువాదం , ఉగ్రవాదం ఓడిపోయాయని , ఎన్డీయే తీసుకున్న నిర్ణయాలతో అక్కడ కూడా ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని అన్నారు . ఇండియాలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని , ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు తామెన్నడూ అభ్యంతరాలు తెలియజేయబోమని , కానీ బలవంతంగా మతాన్ని మార్పిస్తే మాత్రం చర్యలుంటాయని అన్నారు . ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఆర్డినెన్స్ లను తెచ్చాయని గుర్తుచేశారు . మత మార్పిడి వివాహాలకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు .

Related Articles

Back to top button