బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా, COVID19 strain in india?

బ్రిటిన్ ( యుకె ) COVID19 strain in india? నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ ల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది . ఇప్పటికే యుకె నుంచి వచ్చిన పలువురికి కొవిడ్ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సంస్థాగత క్వారంటైన్లో ఉంచారు . తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన 14 మంది కర్ణాటక వాసులకు , కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది . అంతకుముందు భువనేశ్వర్ లో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కూడా వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు.

ఇటీవల బ్రిటన్ నుంచి మొత్తం 2,500 మంది రాష్ట్రానికి తిరిగొచ్చినట్లు గుర్తించామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు . వీరిలో ఇప్పటికే 1,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. 14 మందికి పాజిటివ్ గా తేలిందన్నారు . వీరికి సోకింది కొత్త రకం వైరసా ? కాదా ? అన్నది తేల్చేందుకు నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని వెల్లడించారు . వీటి ఫలితాలు 48 గంటల్లో రానున్నాయని తెలిపారు . ఇక యుకె నుంచి కేరళకు వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు COVID19 strain in india? నమూనాల్ని కూడా పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు . ప్రస్తుతం వీరంతా క్వారంటైన్లో ఉన్నారు . తాజా పరిణామంతో కేరళ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది . కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది . రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘాను బలోపేతం చేశారు . కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . దీంతో కొవిడ్ వ్యాప్తి విశ్వరూపం దాల్చే ప్రమాదం ఉందని అంతా భావించారు . కానీ , అలా జరగలేదు . పైగా మరణాల రేటు తగ్గుముఖం పట్టింది . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠ కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని మంత్రి శైలజ తెలిపారు .

బ్రిటన్లో ఇటీవల రూపాంతరం చెందిన కరోనా వైరస్ బయటపడటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి . భారత్ సహా పలు దేశాలు యుకెకు విమాన సర్వీసులు నిలిపివేశాయి . భారత్ లో ఈ నెల 23 నుంచి 31 వరకు యుకెకు విమానాల రాకపోకలను తాత్కలికంగా రద్దు చేశారు . అయితే 23 అర్ధరాత్రిలోగా భారత్ కు చేరుకున్నవారికి ఎయిర్ పోర్టుల్లోనే కరోనా పరీక్షలు చేశారు . వీరిలో కొందరికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయా ప్రయాణికులను సంస్థాగత క్వారంటైన్ లో ఉంచారు . మరోవైపు కొత్త రకంపై రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి . గత రెండువారాల్లో యుకె నుంచి వచ్చిన , యూకే మీదుగా ప్రయాణాలు చేసిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు . కాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి వైరస్ పాజిటివ్ గా తేలింది . అయితే వారి తల్లిదండ్రులిద్దరికీ నెగెటివ్ రావడం గమనార్హం . సదరు చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి డిసెంబరు 20 న భువనేశ్వర్ చేరుకుంది . అయితే బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా అధికార యంత్రాంగం ఈ చిన్నారి కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించింది . ఫలితాల్లో చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా .. ఆమె తల్లిదండ్రులకు నెగెటివ్ గా తేలింది . దీంతో వీరందరినీ ప్రస్తుతం సంస్థాగత క్వారంటైన్లో ఉంచారు .

Related Articles

Back to top button