గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీకి హైకోర్టు షాక్, High court order deposit of 50 crores
![గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీకి హైకోర్టు షాక్, High court order deposit of 50 crores](https://tv8facts.in/wp-content/uploads/2020/05/IMG_20200509_014545.jpg)
విశాఖపట్నం లో గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి సంఖ్య 12 కు చేరింది, High court order deposit of 50 crores దీన్ని సుమోటోగా స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎల్జి పోలిమర్స్ కంపెనీకి రూ . 50 కోట్లు కోర్టుకు జమ చేయండి అని ఆదేశించింది.
మరియు రాష్ట్ర ప్రభుత్వము జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలో కమిటీ వేసింది. విశాఖలో చోటుచేసుకున్న ఎల్టీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీకేజీ నేపధ్యంలో ఆ సంస్థ యాజమాన్యం ముందు High court order deposit of 50 crores డిపాజిట్ చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఆదేశించింది . జరిగిన ఘటన నేపద్యంలో జరిగిన ప్రాణ నష్టం అంచనా ఆధారంగా మధ్యంతరంగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని పేర్కొంది .
కేంద్ర ప్రభుత్వం , ఎల్జీ పాలిమర్స్ ఇండియా , జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు ( సీపీసీబీ ) కూ నోటీసులు జారీ చేసిన ఎన్పీటీ సంఘటనపై తీవ్రంగా స్పందించింది . జస్టిస్ బి . శేష శయన రెడ్డి నేతృత్వంలో అయిదుగురు సభ్యులుతో కూడిన కమిటీని ఎన్పీటీ నియమించింది . ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18వ తేదీ లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది .
ఈమేరకు ఎఫైటీ చైర్పర్సన్ జస్టిస్ఆదర్శకుమార్ గోయల్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించింది . ఈ కమిటీ సభ్యులుగా ఏయూ మాజీ వీసీ వి . రామ చంద్రమూర్తి , కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య పులిపాటి కింగ్ , సపీసీబీ సభ్య కార్యదర్శి – సీఎఆర్ సంచాలకులూ , వైజాగ్ లోని నీరి హెడను నియమించారు . వీలైనంత త్వరగా ఘటన జరిగిన ప్రాంతాన్ని పాలిమర్స్ కంపెనీని వీరు సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు .
గ్యాస్ లీకేజ్ వల్ల వైజాగ్ లో భారీ ప్రమాదం…|| Gas leak in Vizag
ఈ మెయిల్ ద్వారా నివేదికను పంపాలని ఆదేశించారు . నిజనిర్ధారణ బృందానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలనూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అందించాలని సూచించింది . దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీపీసీబీ చైర్మన్కు సూచించారు .
ఘటనకు కారణాలు తెలుసుకోవడం , మరణించిన వారి సంఖ్యను , ఎంతమందిపై ఘటన ప్రభావం ఉంటుంది , పర్యావరణానికి ఎంతమేర విఘాతం ఏర్పడే అవకాశం ఉంది ? జీవరాశులకు జరిగిన నష్టం ఏమిటి ? అధికారుల పాత్ర ఎంత మేర ఉంది వంటి అంశాలపై దర్యాప్తు జరపాలని ఎన్వీటీ ఆదేశించింది . ఆన్ సైట్ , ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అవసరమని భావించిన ఎస్పీటీ నష్టం నివారణకు ప్రణాళికలనపై కూడా నివేదక ఇవ్వాలని కోరింది .