అడ్డంగా దొరికిన అధికారులు,తహసీల్దార్ మందు పార్టీ, tahsildar booked for lock down violation
![అడ్డంగా దొరికిన అధికారులు,తహసీల్దార్గెస్ట్ హౌస్ లో పార్టీ, tahsildar booked for lock down violation](https://tv8facts.in/wp-content/uploads/2020/04/IMG_20200415_130409.jpg)
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నడి వోడ్డులో ఉన్న రెవెన్యూ tahsildar booked for lock down violation విశ్రాంతి భవనంలో అసాంఘిక కార్యక్రమాలు యథేచ్చగా కొన సాగుతున్నాయి . సోమవారం రాత్రి మద్యం , మాంసాహారంతో విందు చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు .
మధిర తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్ కోసం మధిరలోని రైల్వే స్టేషన్ ఎదురుగా అనేక సంవత్సరాల క్రితం ప్రభుత్వం గెస్ట్ హౌసన్ను ఏర్పాటు చేసింది . ఈ గెస్ట్ హౌస్ లో సోమవారం రాత్రి తహసీల్దార్ సైదులు , ఈ ఓఅర్డి రాజారావు , మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ , సబ్ జైలర్ ప్రభాక ర్ రెడ్డి , ఆర్ఐ మధుసూధన్ , వీఆర్ గంటా శ్రీను మద్యంతో పాటు విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.
విషయం తెలుసుకున్న మీడియా తహశీల్దార్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగా కొంతమంది అధికారులు పరారయ్యారు . మరికొంతమంది అధికారులు బాత్రూమ్ లో , మంచం క్రింద దాక్కున్నారు.
tahsildar booked for lock down violation తహసీల్దార్ కార్యాలయంలో మద్యం , విందు పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందించిన దాదాపు 2గంటలపాటు పోలీస్ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు . దీంతో మధిర మీడియా ద్వారా ఏసీపీకి సమాచారం అందించగా తక్షణమే ఆయన స్పందించి మధిర పోలీసులను విందు జరిగే తహసీల్దార్ గెస్ట్ హౌస్ వద్దకు సిఐ వేణుమాధవ్ , పట్టణ ఎస్ఈ ఉదయ్ కుమార్లు వచ్చారు.
గదిలోకి వెళ్ళిన పోలీస్ అధికారులకు తహశీల్దార్ విశ్రాంతి భవనంలో మందు సీసాలు , మాంసాహారం కనిపించాయి . అదే క్రమంలో గదిలోని మంచం క్రింద దాక్కొని ఉన్న మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసు పట్టుకున్నారు . మందును సీజ్ చేశారు.
నలుగురిపై కేసు నమోదు తహసీల్దార్ సైదులు , మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ , ఈఓఅర్డి రాజారావు , సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసి వారికి సంబంధించిన మోటార్ సైకిళ్లను , కారును సీజ్ చేసినట్లు పట్టణ ఎస్ఐ ఉదయకుమార్ విలేకరులకు తెలిపారు.
ఈ విందుల్లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతున్న ఆర్ఐ మధుసూధన్ , మాటూరు వీఆర్ఓ గంటా శ్రీనును సైతం విచారించి ఈ విందు ల్లో పాల్గొన్నట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు .