యూపీలో ఇద్దరు పూజరుల దారుణ హత్య, Hindu priests murdered in UP
![యూపీలో ఇద్దరు పూజరుల దారుణ హత్య, Hindu priests murdered in UP](https://tv8facts.in/wp-content/uploads/2020/04/IMG_20200429_160531.jpg)
యూపీలో Hindu priests murdered in UP ఇద్దరు ఆలయ పూజారులను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
లక్నో లో నీ బులంద్ షహర్ జిల్లాలోని ఓ ఆలయంలో మంగళవారం ఉదయం ఇద్దరు పూజారులు హత్యకు గురయ్యారు . అనుషహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పగువానా గ్రామంలో ఉన్న శివాలయంలో జగదీష్ ( 55 ) , షేర్ సింగ్ ( 45 ) అనే ఇద్దరి పూజారులను నిందితుడు లారీతో కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు . హంతకుడునుతమ అధీనంలోకి తీసుకున్నామని వెల్లడించారు .
దీంతో ఈ నేరంపై ప్రతిపక్ష నేతలు అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు . ఇటీవల మహారాష్ట్రలోని పాలఘర్ లో ఇద్దరు సాధువులను వారి డ్రైవర్ను హతమార్చిన తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందనను కాంగ్రెస్ , శివసేన ప్రస్తావించింది . యూపీ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ మురారి అలియాస్ రాజు అనే యువకుడు రెండు రోజుల క్రితం సాధువులు ఉపయోగించిన పటకారు ను దొంగిలించాడని ఆరోపించారు .
గంజాయి ప్రభావంతో ఉన్న యువకుడిని ఆలయ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు . సీనియర్ అధికారులు సంఘటన సలానికి చేరుకుని ఆ వ్యక్తిని ప్రశ్నించగా సోమవారం రాత్రి భాంగ్ తీసుకున్న తరువాత ఆలయానికి వెళ్లి అక్కడ పడుకున్న సాధువులను Hindu priests murdered in UP లాఠీతో కొట్టి చంపినట్టు తెలిపాడు . మత్తులో ఉన్న ఆ యువకుడు తను దేవుడి కోరిక మేరకు అలా చేశానని తనకు పుజారులతో ఎలాంటి గొడవలేదని తెలిపాడు .
నిందితుడు ఇంకా మాదకద్రవ్యాల ప్రభావంతో ఉన్నందున యువకు డిని తరువాత విచారించనున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు . నేరంజరిగిన ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో నగ్నంగా తిరుగుతున్న యువకుడిని గుర్తించి నగ్రామస్తులు అతడిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు . ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు . అధికారులను వివరణాత్మక నివేదిక అందజేయాలని ఆదేశించారు .