ఓవైసీ పై సీరియస్ అయిన బండి సంజయ్, Bandi Sanjay serious on owaisi
![ఓవైసీ పై సీరియస్ అయిన బండి సంజయ్, Bandi Sanjay serious on owaisio](https://tv8facts.in/wp-content/uploads/2020/04/IMG_20200405_141327.jpg)
ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై తెలంగాణ Bandi Sanjay serious on owaisi బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు .
Bandi Sanjay serious on owaisi మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు . కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు .
వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని , ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి హితవుపలికారు . దేశ ఐక్యతకు మోదీ ఈ కార్యక్రమం పిలుపునిచ్చారని సంజయ్ గుర్తుచేశారు . ఆదివారం రాత్రి దారుసలేం వెళ్లి చూస్తూ ప్రజల స్పందన కనువిందు చేస్తుందని అన్నారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్లపై పలువురు ద్రోహులు భౌతిక దాడులకు దిగినా వైద్యులు సహనంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు . కరోనా బారిన పడి వేలమంది బాధపడుతుంటే ఒవైసీ హాస్పిటలను ఐసోలాషన్ వార్డుకు ఇచ్చి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని ఒవైసీ . ఆయనకు దమ్ముంటే డాక్టర్లపై , నర్సులు , పోలీసులు , ఆశావర్కర్లలపై దాడులను ఆపాలి అని అన్నారు.
పేదప్రజలకు ఇబ్బంది పడకూడదని కేంద్ర ప్రభుత్వం బియ్యం , పెన్షన్ , గ్యాస్ , జనాధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తోంది . వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలి . ఆదివారం రాత్రి 9 గంటలకు 9 దీపాలు వెలిగించాలి అని బండి సంజయ్ తెలిపారు .
Recent posts ::
- రూ.500కు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీం మార్గదర్శకాలు ఇవే….
- కొత్త రేషన్ కార్డు అప్లయ్ విధానం, కావల్సిన పత్రాలు, అర్హతలు….
- 2023 లో కాబోయే కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!
- 2023 లో కాబోయే చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి.
- 2023 లో కాబోయే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరూ? ఆన్లైన్ ఓటింగ్ లో పాల్గొనండి!!