సంచలనం సృష్టించిన మంచిర్యాల యువతి, Mancherial girl made history

తెలంగాణ బిడ్డ సుహర్ష అరుదైన ఘనత సాధించింది. Mancherial girl made history ఓ వైపు కోవిద్ ప్రభావం , మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు . మొన్న సూర్య దీపిక నేడు సుహర్ష ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ ఆఫ్ అబర్న్ లో ఎం.ఎస్సీ సీటు సాధించారు .

 తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న వీరిద్దరికీ ఈ గొప్ప అవకాశం వచ్చింది . గతంలో సూర్య దీపిక , ఎం ఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో సీటు సాధించింది . ఇప్పుడు సుహర్ష ఎం.ఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సును ఎంపికైంది . ట్యూషన్ ఫీజు రెండేళ్లకు కలిపి 30 వేల డాలర్లు యూనివర్సిటీ మినహాయింవును ఇచ్చింది . దీనితో పాటు 1500 డాలర్ల స్కాలర్ షిప్ ను కూడా రెండేళ్ల పాటు ఆఫర్ చేసింది . ఈ మొత్తం సుమారు 50 లక్షలు కానుంది . అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్ గా ఉన్న జానకిరాం రెడ్డి అవలపాటి సహకారంతో వీరిద్దరూ సీటు సాధించారు .

Mancherial girl made history ::

 సుహర్ష మంచిర్యాలకు చెందిన వారు . ఆమె తండ్రి సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్నారు . గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని , కాలేజీలో అనువైన వాతావరణం , ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని సుహర్ష తెలిపారు . గతంలో చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఫారెస్ట్ కాలేజీ అధ్యాపకులకు బ్రిటిష్ కొలంబియా యూనివర్సీటీ , కెనడా రెండు విడతల్లో ట్రైనింగ్ ఇచ్చింది . కోర్సు , సెలబస్ , టీచింగ్ పద్ధతులు , పరిశోధన విభాగాల్లో శిక్షణ ఇచ్చారు . ఫైనల్ ఇయర్ లో మొత్తం 49 మంది స్టూడెంట్స్ ఉంటే , అందులో 31 మంది అమ్మాయిలే . మరో ఆరుగురు విద్యార్థినులు ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సీటీ డెహ్రాడూన్లో వుడ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ చేసేందుకు సిద్ధమౌతున్నారు . తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తొలిసారిగా ఎంట్రెస్ టెస్ట్ కేంద్రాన్ని కూడా హైదరాబాద్ నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది . ఫైనల్ ఇయర్ లో ఉన్న మరో 20 మంది సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు . 

Related Articles

Back to top button