వరంగల్ లో ఘోర సంఘటన, family left deadbody at hospital
![వరంగల్ లో ఘోర సంఘటన, family left deadbody at hospital](https://tv8facts.in/wp-content/uploads/2020/07/IMG_20200721_121309.jpg)
కరోనాతో చనిపోయిందని మహిళ మృతదేహాన్ని వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యులు, family left deadbody at hospital మూడు గంటలపాటు వర్షంలోనే ఉన్న మృతదేహం.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమాననీయ ఘటన చోటుచేసుకుంది . కరోనా సోకిందనే భయంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటి ముందు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వర్షంలోనే వదిలేసి వెళ్ళిపోయారు . సుమారు మూడు గంటలపాటు ఈ మృతదేహం క్యాజువాలిటి ముందే ఉండిపోయింది .
family left deadbody at hospital :
కరోనా సోకిందనే భయంతో ఓ మహిళ మృతి చెందడం దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పట్టించు కోకుండా వదిలేశారు . వర్షం తగ్గిన తర్వాత ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఈ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు . హన్మకొండకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో ఎంజీఎంకు వచ్చింది . ఆమెకు చికిత్స అందించేలోపే కన్నుమూసింది . కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆ మహిళను కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్ళకుండా క్యాజువాలిటీ ముందు వర్షంలోనే వదిలేసి వెళ్ళిపోయారు . ఆస్పత్రి సిబ్బంది కూడా అటువైపు చూడలేదు . మూడుగంటలపాటు ఆవరణలోనే స్ట్రెచర్ పైనే మృతదేహం ఉంది . వర్షం తగ్గాక ఎంజీఎం సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు .