రైలు లోనే ప్రసవించిన మహిళ, Women delivered baby in train

తెలంగాణలోని కాజీపేట నుంచి ఒడిశాకు బయలు దేరిన రైలులో వలస కార్మికురాలు Women delivered baby in train బిడ్డకు జన్మనిచ్చింది . ఆమెకు పురిటి నొప్పులు వచ్చినట్టు సమాచారం రావడంతో తితాఘర్ వద్ద రైల్వే డివిజన్ మెడికల్ ఆఫీసర్ స్పందించి .. ఆమెకు డెలివరీ చేశారు . తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని , స్థానిక ఆసుపత్రికి తరలించా మని మెడికల్ అధికారి తెలిపారు .

 సికింద్రాబాద్ నుంచి బలంగీరు బయలు దేరిన శ్రామిక రైలులో మరో వలస కార్మికురాలు శుక్రవారం ఒక బిడ్డకు జన్మనిచ్చింది . మే 1 నుంచి వలస కార్మికుల తరలింపునకు ఏర్పాటుచేసిన శ్రామిక రైళ్లలో ఇప్పటి వరకు 20 మందికి పైగా చిన్నారులు జన్మించారని , కరోనా వరల్డ్ లోకి స్వాగతమంటూ … హ్యాష్ ట్యాగ్ లను జతచేస్తూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ట్వీట్ చేశారు .

వింటేనే కన్నీళ్లు తెప్పించేలా వలస కార్మికుల కష్టాలు రోజు రోజుకూ వెలుగుచూస్తున్నాయి . లాక్ డౌన్ నేపథ్యంలో పట్టణంలో పనులు లేక , ఇండ్లకు అద్దెలు కట్టలేక , తిండికి డబ్బు లేక పస్తులతో అగచాట్లు పడేకన్నా సొంతూర్లకు వెళ్లడమే నయమనుకుంటూ కాలి నడకన బయల్దేరిన వారిలో వందల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు . ఎట్టకేలకు స్పందించి శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా కిక్కిరిసి ఉండటం , కనీస సౌకర్యాలు లేకపోవడం , 10 గంటలకు పైగా మార్గమధ్యంలో నిలిపి వేస్తుండటం తో ఆకలిదప్పులతో వారు అలమటిస్తున్నారు . పలుచోట్ల ఆందోళనలు సైతం జరుగుతున్నాయి . ఇటువంటి పరిస్థితుల్లో వారితో పాటు ప్రయాణమైన ఆయా కుటుంబాల్లోని నిండు గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది .

Women delivered baby in train ::

 ఈ నెల 1 నుంచి 20 మందికి పైగా రైళ్లలోనే తమ బిడ్డలకు జన్మ నిచ్చారని రైల్వేశాఖ వెల్లడించింది . రైళ్లను మధ్యలో నిలిపివేసి , వారికి సకాలంలో వైద్యం అందించడంతో తల్లీబిడ్డలు ప్రాణాలతో బయట పడటం ఊరట కలిగించింది . గుజరాత్ లోని సూరత్ నుంచి ఓ నిండు గర్భిణి బీహార్‌లోని నవడా ( పాట్నాకు 100 కిలోమీటర్ల దూరం ) రైలులో బయలుదేరగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి . ఈ సమాచారం మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్లగా .. అధికారులు ఆగ్రాలో నిలిపివేశారు . డాక్టర్ పులకిత రైలులో డెలివరీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు . తల్లి , బిడ్డ క్షేమంగా ఉన్నారని బిడ్డ ఫోటోను రైల్వే ట్వీట్ చేసింది.

Related Articles

Back to top button